- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీ ప్రభుత్వం దళితులపై యుద్ధం ప్రకటించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. దళిత వర్గాలన్ని తన కాళ్ల కింద ఉండాలన్నట్లుగా జగన్ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎంతో గొప్ప పేరున్న ఏపీ పోలీస్ శాఖ దిగజారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కౌంటర్ ఉద్యమాలు ఆపాలంటూ వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
రాజమండ్రిలో దళితబాలికపై జరిగిన అత్యాచార ఘటన ముందు ఢిల్లీ నిర్భయ ఘటన చాలా చిన్నదని రామయ్య అభిప్రాయపడ్డారు. దళితులు చేస్తున్న ఫిర్యాదులను జగన్ నీరు గారుస్తున్నారన్నారు. ఈ విషయంలో అధికారులు కూడా ఏమి పట్టనట్టు కూర్చున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ 1989 ప్రకారం ప్రభుత్వాన్ని కూడా ముద్దాయిగా చేర్చాలంటూ వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
Next Story