కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లోకేశ్ లేఖ

by  |
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి లోకేశ్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం చేనేతలను ఆదుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ‌కి లేఖ రాశారు. ఇటీవల కేంద్రం రద్దు చేసిన అఖిల భారత చేనేత మండలిని తిరిగి పునరుద్ధరించాలని లేఖలో కోరారు. చేనేతలను ఆదుకోవడానికి 1992లో అప్పటి పీవీ ప్రభుత్వం చేనేత మండలిని ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చశారు. ప్రస్తుతం చేనేతల మండలి రద్దుతో చేనేతలు తీవ్రంగా నష్టోతున్నారని.. దీంతో వెంటనే పునరుద్ధరించాలని లోకేశ్ కోరారు.

Next Story