‘అప్పుడే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోగలం’

by  |
nara lokesh
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ కీలక నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాస్‌కు గురువారం మద్దతు తెలిపారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ… విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకోవాలని సూచించారు. శ్రీనివాస్ దీక్షకు ప్రజలు, కార్మిక సంఘాలు, అన్ని పార్టీలు ఒక్కటై మద్దతు తెలిపినప్పుడే ప్రైవేటీకరణను అడ్డుకోగలం అని అన్నారు. ప్లాంట్ పరిరక్షణ కోసం పల్లా శ్రీనివాస్ చేస్తున్న దీక్షకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని వెల్లడించారు. ప్రైవేటీకరణపై అందరూ కలిసి పోరాడాలని అని పిలుపునిచ్చారు.

Next Story