రైతుల సాహసం స్ఫూర్తినిస్తోంది : లోకేష్

by  |
Nara lokesh
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సోమవారం అమరావతి రాజధాని రైతుల పోరాటం నేటికి 300 రోజులు పూర్తి కావడంతో వారికి ట్విట్టర్ వేదికగా మద్దతు తెలిపారు. ‘అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు 300 రోజులుగా చేస్తోన్న పోరాటానికి మద్దతుగా.. రాజధాని గ్రామాలలో నా పర్యటన పెనుమాక గ్రామం నుంచి మొదలయ్యింది. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఆటంకాలు కలిగిస్తున్నా, వెనుకాడని రాజధాని రైతుల సాహసం స్ఫూర్తినిస్తోంది’ అని లోకేశ్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.


Next Story