కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారు !

by  |
కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారు !
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నీటి నిర్వహణను గాలికి వదిలేసి కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తున్నారని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు విమర్శించారు. ముందుగా అప్రమత్తం చేసేందుకు ఉపయోగపడే ఆర్టీజీఎస్‌ను నిర్వీర్యం చేశారని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వరదలు ముంచెత్తాయని మండిపడ్డారు. భారీ వరదలతో ప్రజలు నష్టపోతే జగన్ సర్కార్ కనీసం స్పందించడం లేదన్నారు. వెంటనే వరద బాధితులకు సాయం అందించి, నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed