- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ టీడీపీ లీడర్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి అనంతపురం ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కరోనా సోకడంతో పాటు, గుండెకు శస్త్ర చికిత్స జరిగినందున బెయిల్ మంజూరు చేయాలని వేసిన పిటిషన్పై విచారించిన కోర్టు ఈ మేరకు బుధవారం బెయిల్ ఇచ్చింది. నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో దాదాపు 50రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించిన జేసీకి బెయిల్ మంజూరు కాగా, ఇంటికి వెళ్తున్న క్రమంలో అనుచరులతో కలిసి వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ర్యాలీని అడ్డుకున్న సీఐని దూషించడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. దీంతో మళ్లీ ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి మళ్లీ జైలులో ఉన్న ఆయనకు మంగళవారం కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలోనే వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Next Story