AP News :అసలు జగన్‌కు వారి కష్టాలు కనబడుతున్నాయా?

by  |
AP News :అసలు జగన్‌కు వారి కష్టాలు కనబడుతున్నాయా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన ఉమ.. ‘‘వరుసగా రెండో ఏడాది మామిడి రైతులకు తీవ్ర నష్టాలు వచ్చాయి. సాగు తగ్గిపోతున్నది. మద్దతు ధర లభించకపోవడమే కాకుండా.. పెట్టుబడి కూడా దక్కని వైనం నెలకొంది. రైతులు వడ్డీలకు తెచ్చి పంట పండించారు. అకాల వర్షాల వల్ల లారీలు సైతం తోటల్లోకి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇంకా దాదాపు 50శాతం కాయలు తోటల్లోనే ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు కష్టాలు సీఎం జగన్‌కు కష్టాలు కనబడుతున్నాయా?. అని ప్రశ్నించారు.

Next Story

Most Viewed