సీఎం ఇలాకాలోనే.. ఆమెను రేప్ చేసి చంపారు : చంద్రబాబు

by  |
సీఎం ఇలాకాలోనే.. ఆమెను రేప్ చేసి చంపారు : చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అమలు కావడం లేదని అందులో పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే నాగమ్మ అనే దళిత మహిళను అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపించారు.

బాధితురాలికి ఇంత వరకు న్యాయం చేకూరలేదని, పోలీసులు మాత్రం వైసీపీ నాయకులు చెప్పినట్లు వింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో దళితులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed