- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీబ్యూరో : ఇరవై నెలల వైసీపీ దుర్మార్గ పాలనపై ప్రజలు ప్రశ్నించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో మాట్లాడుతూ..ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయినట్లు చెప్పారు. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
ఎంతో మందిని ఇబ్బంది పెట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలను నిలువుదోపిడీ చేస్తూ సంక్షేమ పథకాల పేరుతో మభ్యపెడుతుందన్నారు. గంటకో అత్యాచారం, పూటకో హత్యగా వైసీపీ పాలన కొనసాగుతుందని చెప్పారు. వీటిపై తెలుగుదేశం పార్టీ పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Next Story