ఏపీ సీఎంఆర్ఎఫ్ నిధికి టీడీపీ నేతల విరాళం

by  |

కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ సంక్షేమ నిధికి తమ నెల జీతం విరాళంగా ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుకొచ్చారు. మంగళవారం టీడీఎల్పీ సభ్యులతో ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించిన మాజీ సీఎం చంద్రబాబు కరోనా వ్యాధి నివారణకు, బాధితులను ఆదుకునేందుకు ఈ ఫండ్‌ను వినియోగించాలని కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ తమవంతుగా ఏపీ ప్రభుత్వానికి సహయం అందించాలని కోరారు. అంతేకాకుండా కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. టీడీపీ సభ్యులు, చంద్రబాబు వ్యక్తిగతం, తన కుటుంబం తరఫున రూ.10లక్షల విరాళాన్ని ప్రకటించారు.

Tgas: ap cmrf , 10 lacs fund, tdp leader, mla and mlc, ex cm cbn, corona



Next Story

Most Viewed