బైకుల రిలీజ్‌ కోసం సీఎంకు వినతి

by  |
బైకుల రిలీజ్‌ కోసం సీఎంకు వినతి
X

దిశ ఏపీ బ్యూరో: లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో పోలీసులు సీజ్ చేసిన లక్ష బైకులను విడిపించాలని టీడీపీ నేత బొండా ఉమ సీఎం జగన్‌ను కోరారు. ఈ మేరకు ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన.. గత 60 రోజుల నుంచి సామాన్యుల వాహనాలను పోలీసులు సీజ్ చేస్తుండటం దారుణమని అభిప్రాయపడ్డారు. లక్ష వాహనాలను పోలీసులు సీజ్ చేశారని ఆయన వెల్లడించారు. వాహనాలు కోల్పోయిన వారు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు కూడా వెళ్లలేని పరిస్థితి తలెత్తిందని, పోలీసుల అధీనంలో ఉన్న బైక్‌లు తుప్పుపట్టి పోతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సామాన్యుల బైక్‌లు విడిపించాలని సీఎంను కోరారు.

Next Story

Most Viewed