ఏ కోర్టులో కేసులు వేశామో వారే చెప్పాలి..

by  |
ఏ కోర్టులో కేసులు వేశామో వారే చెప్పాలి..
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఫైర్ అయ్యారు. ఆడలేక మద్దెల వోడ అన్నట్టు వైసీపీ సర్కార్ తీరు ఉందని ఆయన అన్నారు. పేదల ఇండ్ల స్థలాలపై ఏ కోర్టులో టీడీపీ కేసులు వేసిందో వైసీపీ నేతలు చెప్పాలని అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. పేదల ఇండ్ల స్థలాల పేరిట రూ. 4వేల కోట్లను వైసీపీ నేతలు కొట్టేశారని ఆయన చెప్పారు. ఇళ్ల స్థలాల అవినీతిపై వైసీపీ సర్కార్ ఎందుకు దర్యాప్తు జరిపించడం లేదని ఆయన ప్రశ్నించారు.



Next Story