‘చంచల్ గూడ చరిత్ర సగంలో ఆగింది’

by  |
‘చంచల్ గూడ చరిత్ర సగంలో ఆగింది’
X

దిశ, ఏపీ బ్యూరో: చంచల్ గూడ చరిత్ర పుస్తకం సగంలో ఆగిందని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన స్పందిస్తూ, ప్రభుత్వాన్ని క్యాడర్‌ నుంచి లీడర్‌ వరకు అంతా చీత్కరించుకుంటున్నారని అన్నారు. చంచల్‌గూడ చరిత్ర పుస్తకం సగంలో ఆగిందని.. దానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మొత్తం శకుని మామే! అని ఆయన ట్వీట్‌ చేశారు. మరోవైపు సీఎం జగన్‌ తనను నమ్ముకున్న వాళ్లని మోసం చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ముఖ్యమంత్రి కోసం పార్లమెంట్‌ సీటును త్యాగం చేసిన బాబాయ్‌ హత్య కేసులో ఉదాసీనత చూపారని ఆరోపించారు. జగన్‌ సీఎం కావాలని తపించిన మాజీ సీఎస్‌ ఎల్వీసుబ్రహ్మణ్యం,ఆజేయకల్లం తదితరులకు ఆశాభంగమే ఎదురైందన్నారు.

Next Story

Most Viewed