వారందరికీ రూ.2కోట్ల బీమా చేయించండి

by  |
వారందరికీ రూ.2కోట్ల బీమా చేయించండి
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా, కుటుంబసభ్యులకు దూరంగా ఉంటూ ప్రజల కోసం వైరస్ తో పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ భద్రతకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. కరోనాపై పోరాటం చేస్తోన్న వైద్య, పోలీస్‌, పారిశుధ్య సిబ్బందితో పాటూ ఇతర అన్ని శాఖలను గుర్తించి, వారికి తక్షణమే 2 కోట్ల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బీమా ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించాలని ఆయన సూచించారు.


Next Story