ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?

by  |
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా?
X

దిశ, వెబ్‌డెస్క్: గొల్లపూడిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేసేందుకు వచ్చిన దేవినేని ఉమను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిపై చర్చకు రమ్మంటే వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని అచ్చెన్నాయుడు విమర్శించారు.

Next Story

Most Viewed