టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది: మంత్రి అవంతి

by  |
టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది: మంత్రి అవంతి
X

దిశ,వెబ్‌డెస్క్: బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతిస్తున్నట్టు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీవివాస్ అన్నారు. సీఎం జగన్ ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. విశాఖలో టీడీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడి వైసీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదని వెల్లడించారు. మూడు రాజధానులే తమ విధానం అని మరోసారి ఆయన స్పష్టం చేశారు.



Next Story