శిరోముండనం బాధితుడికి టీడీపీ ఆర్థిక సహాయం

by  |
శిరోముండనం బాధితుడికి టీడీపీ ఆర్థిక సహాయం
X

అమరావతి : శిరోముండనం బాధితుడైన దళిత యువకుడికి టీడీపీ రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. దళిత యువకుడు ప్రసాద్‍ను పోలీసుల సమక్షంలోనే శిరోముండనం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

దళితుల పట్ల వైసీపీ నాయకులు, అధికార పార్టీ నేతల దుర్మార్గాలను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. ఇప్పటికైనా దళిత వ్యతిరేక నిర్ణయాలను విడనాడాలని చంద్రబాబు హెచ్చరించారు.



Next Story