జమిలి ఎన్నికలు జరిగితే వైసీపీ ఉండదు: బొండా ఉమ

by  |
జమిలి ఎన్నికలు జరిగితే వైసీపీ ఉండదు: బొండా ఉమ
X

దిశ,వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఇవ్వడం తప్పు కాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు అన్నారు. ఆర్టికల్ 73 ప్రకారమే పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఇచ్చామని తెలిపారు. ఎస్ఈసీ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇస్తామని ఆయన వెల్లడించారు. తాము మేనిఫెస్టో ఇవ్వకూడదనే అర్హత వైసీపీకి లేదని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలు జరిగితే వైసీపీ సర్కార్ ఉండదని అన్నారు. కాగా పంచాయతీ ఎన్నికలకు టీడీపీ పార్టీ మెనిఫెస్టోను విడుదల చేసింది. దీనిపై టీడీపీకి ఎస్ఈసీ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed