ఎయిర్ ఏషియాలో వాటాను పెంచుకోనున్న టాటా గ్రూప్!

by  |
ఎయిర్ ఏషియాలో వాటాను పెంచుకోనున్న టాటా గ్రూప్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రధాన విమానయాన ఒప్పందంలో భాగంగా మలేషియా బడ్జెట్ కేరియర్ ఎయిర్ ఏషియా ఇండియాలో టాటా గ్రూప్ సంస్థ తన వాటాను గణనీయంగా పెంచుకోనుంది. ఇదివరకు టాటా గ్రూపునకు ఎయిర్ ఏషియాలో 51 శాతం వాటా ఉండగా, దీన్ని 83.67 శాతానికి పెంచుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ అంశంపై ఇరు సంస్థల మధ్య ఒప్పందం గురించి అధికారికంగా వెల్లడి కానుంది.

మలేషియా బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా గ్రూప్ మంగళవారం తన భారత కార్యకలాపాల్లో 32.67 శాతం వాటాను టాటా గ్రూపునకు విక్రయించాలని భావిస్తున్నట్టు ప్రకటించింది. ఈ విక్రయం ద్వారా ఆగ్నేయాసియా మార్కెట్లో కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టేందుకు వీలవుతుందని కంపెనీ పేర్కొంది.

Next Story

Most Viewed