- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దుచేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రైతులకు మద్దతు ప్రకటిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా మహత్మాగాంధీ మనువరాలు తారా గాంధీ భట్టా చర్జీ రైతు ఆందోళనలకు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే శనివారం రాజధాని సరిహద్దులోని ఘాజీపూర్ ప్రాంతానికి వెళ్లి రైతులను కలిసినట్లు BKU (భారతీయ కిసాన్ సంఘ్) మీడియా ఇన్చార్జి ధర్మేంద్ర మాలిక్ ప్రకటించారు. 84ఏళ్ల వయస్సులో ఆమె రైతుల కోసం ఇక్కడిదాకా రావడం సంతోషకరమని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా తారా గాంధీ రైతులతో మాట్లాడుతూ.. ‘దేశం ప్రయోజనం మీతోనే ఉందని.. మీ వల్లే తాము, దేశం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉందని చెప్పారు’. ప్రజలు నిరసన ప్రాంతాలకు వచ్చి రైతుల కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు. చివరగా తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, రైతు నిరసనలకు సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్లు వెల్లడించారు.