- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
థప్పడ్ సినిమాతో ప్రేక్షకుల మనసులో బలమైన ముద్ర వేసింది తాప్సీ పన్ను. చెంప దెబ్బతో భార్య అనుభవించే బాధను డైరెక్టర్ అనుభవ్ సిన్హా చాలా చక్కగా తెరకెక్కించగా.. తాప్సీ అద్భుతంగా నటించి మన్ననలు పొందింది. కాగా ఈ సినిమాకు ముందు తాప్సీ నటించిన చిత్రం మిషన్ మంగళ్.. అక్షయ్ కుమార్, విద్యా బాలన్, నిత్యా మీనన్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫొటో షేర్ చేసిన తాప్సీ.. మిషన్ మంగళ్ షూట్ తొలి రోజుల్లో తీసిన ఫొటోగా తెలిపింది. కలిసి పని చేసేందుకు అందరం కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యే వాళ్లమని చెప్పింది. ఈ సెట్ చాలా ఆనందంగా ఉండేదని.. మనమంతా గర్వించగలిగే విషయాన్ని సృష్టించే వారితో నిండి ఉండేదని తెలిపింది తాప్సీ.
View this post on InstagramA post shared by Taapsee Pannu (@taapsee) on
ఈ సినిమా సైన్ చేసేందుకు రెండు కారణాలు ఉన్నాయని అంటుంది తాప్సీ. మంచి కథతో ఉన్న ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది అనేది ఒక కారణం కాగా.. రెండోది ఈ అందమైన నటుల బృందంలో భాగం కావాలి అనుకున్నానని చెప్పింది. ప్రతి మూమెంట్ కూడా సెలబ్రేట్ చేసుకుంటామని తనకు ముందే తెలుసు అని చెప్పింది తాప్సీ.