షాకింగ్.. క్షుద్రపూజల పేరుతో బాలికకు మత్తుమందు ఇచ్చి..

by  |
షాకింగ్.. క్షుద్రపూజల పేరుతో బాలికకు మత్తుమందు ఇచ్చి..
X

దిశ, వెబ్ డెస్క్ : క్షుద్రపూజల పేరుతో బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు ఓ కిరాతకత తాంత్రికుడు. బాలిక అనారోగ్యంతో మాంత్రికుడి దగ్గరకు వెళ్లగా.. మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన యూపీలోని బస్తీ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు తహ్రీర్​పై అత్యాచార, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకారం.. ఈ నెల 22వ తేదీన రాత్రి బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాధితురాలి తల్లి తాంత్రికుడి దగ్గరకు తీసుకువెళ్లింది. ఇదే అదునుగా భావించిన కామాంధుడు.. చికిత్స పేరిట బాలికకు మత్తు మందు ఇచ్చి.. అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ఆమెపై అత్యాచారం చేశాడు.

ఈ క్రమంలో బాలికకు తీవ్ర రక్తస్రావం అయినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తస్రావం చూసిన బాధితురాలి తల్లి ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.



Next Story

Most Viewed