మరిన్ని ఆంక్షలు.. మాల్స్, సెలూన్లు, బ్యూటీపార్లర్లు బంద్

by  |
మరిన్ని ఆంక్షలు.. మాల్స్, సెలూన్లు, బ్యూటీపార్లర్లు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరిన్ని కఠిన ఆంక్షలను విధించింది. కొత్తగా విధించిన ఆంక్షల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని మాల్స్, థియేటర్లు, జిమ్స్, సెలూన్లు, స్పాలు, బ్యూటీ పార్లర్లను మూసివేస్తుండగా.. హోటళ్లు, రెస్టారెంట్లు, పార్సిల్, టేక్ ఎవే సర్వీసులకు మాత్రమే అనుమతిస్తారు. వివాహ కార్యక్రమాలకు 50 మందిని, అంత్యక్రియలకు 25 మందిని అనుమతిస్తారు. ఈ-పాస్‌కు క్లియరెన్స్ వస్తేనే ప్రయాణీకులను రాష్ట్రంలోకి అనుమతిస్తారు. ఈ ఆంక్షలు ఏప్రిల్ 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.



Next Story

Most Viewed