- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమిళ తల్లిని గొప్పతనాన్ని అభివర్ణిస్తూ రాసిన తమిళ్ తాయి వాజుతును రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఈ పాట వినిపించినప్పుడు తప్పనిసరిగా లేచి నిల్చొని, గౌరవాన్ని ఇవ్వాలని సూచించారు. ఇటీవలే మద్రాస్ హైకోర్టు దీనిని కేవలం ప్రార్థన గీతం మాత్రమేనని జాతీయ గీతం కాదని పేర్కొంది. అంతేకాకుండా ఈ పాట వినగానే ఎవరూ లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్ర గీతంగా నిర్ణయిస్తూ నూతన జీవోను జారీ చేశారు. నిల్చోవడానికి వీలులేని వారికి మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో, యూనివర్సిటీల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ఆధీనంలోని కార్యాలయాల్లో ఆలపించాలని పేర్కొంది.
Next Story