స్పీకర్, మంత్రి కారు ‘ఢీ’ .. వారికి గాయాలు

by  |
స్పీకర్, మంత్రి కారు ‘ఢీ’ .. వారికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్, మంత్రి ఎస్పీ వేలుమణి కాన్వాయ్‌లు ప్రమాదానికి గురయ్యాయి. రాష్ట్రంలోని ధారాపురంలో ప్రధాని నరేంద్ర మోదీ సభలో పాల్గొనేందుకు బయలుదేరిన ఇద్దరు నేతల కాన్వాయ్‌లు ఒకదానికి మరొకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

స్పీకర్ ధ‌న‌పాల్ కాన్వాయ్ ధారాపురంలోని సూరియ‌న‌ల్లూర్ టోల్ గేట్ వ‌ద్దకు చేరుకున్న సమయంలో వెనుక నుంచి మంత్రి వేలుమణి కాన్వాయ్ వేగంగా దూసుకొచ్చి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో స్పీకర్ కాన్వాయ్‌లోని ఇన్నోవా వాహనం, మంత్రి కాన్వాయ్ లోని మరో వాహనం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రమాదంలో స్పీకర్‌కుగానీ, మంత్రికిగానీ ఎలాంటి గాయాలు కాలేదని, వాహనాలను నడిపిన డ్రైవర్లు ఇద్దరూ స్వల్పంగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు.

రెండు కార్లు అతివేగంలో ఉన్న కారణంగా కారు భాగాలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగా వాటిని వేరు చేసేందుకు క్రేన్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది.



Next Story