మరో పాన్ ఇండియా మూవీలో మిల్కీ బ్యూటీ..?

by  |
tamanna news
X

దిశ, వెబ్‌డెస్క్: తమన్నా భాటియా.. దశాబ్దం కాలంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఈ భామ వరుస సినిమాలను లైన్లో పెట్టి బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఒక పక్క వెండితెర మీద మెరుస్తూనే మరోపక్క ఓటిటీ లోను తన సత్తా చూపుతోంది. ఇప్పటికే ‘బాహుబలి’ లాంటి పాన్ ఇండియా మూవీ ఫ్రాంచెస్ లో నటించిన ఈ భామ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కూడా నటించి మెప్పించింది. ఇక తాజాగా మిల్కీ బ్యూటీ మరో పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది.

రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్ 2’ తర్వాత కన్నడ దర్శకుడు నార్తన్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా ఎంపికయ్యినట్లు తెలుస్తోంది. ఆర్మీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటీకే తమన్నా ‘కెజిఎఫ్’ లో యష్ సరసన ఒక ప్రత్యేక గీతంలో మెరిసి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు యష్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని కన్నడ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇదే కనుక నిజమైతే మిల్కీ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే అని చెప్పాలి. ప్రస్తుతం తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’, ‘ఎఫ్ 3’ చిత్రాలలో నటిస్తుంది.

Next Story

Most Viewed