- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు తమ అరాచకానికి అప్పుడే తెరలేపారు. దేశంలోని వివిధ జైళ్లల్లో మగ్గుతున్న టెర్రరిస్టు అగ్రనేతలను విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. కాబూల్, కాందహార్, బగ్రాం జైళ్ల నుంచి పలువురు టెర్రరిస్టులను ఇప్పటికే రిలీజ్ చేశారు. కేవలం వారం రోజుల్లోనే 2వేల 300 మంది ఉగ్రవాదులను విడుదల చేసినట్టు తెలుస్తోంది. క్రమంగా ఆప్ఘన్లో పరిస్థితులు దిగజారుతుండటంతో అక్కడి పౌరులు దేశాన్ని వీడేందుకు సిద్ధమవుతున్నారు.
కాబూల్ ఎయిర్ పోర్టును తాలిబన్లు చుట్టుముట్టడంతో చెక్ పోస్టులు దాటి వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఆ దేశంలో చిక్కుకున్న తమను రక్షించాలని అగ్రదేశాల సాయం కోరుతున్నారు. మరోవైపు కాబూల్ ఎయిర్ పోర్టులో విమానాల కోసం పెద్ద ఎత్తున మహిళలు పడిగాపులు గాస్తున్నారు. అంతేకాకుండా దేశ రాజధాని కాబుూల్లో కొందరు మహిళలు రోడ్డెక్కారు. భావప్రకటన స్వేచ్ఛను అడ్డుతగలొద్దని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.