‘మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి’

by  |
‘మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి’
X

దిశ, కొత్తగూడ : కొత్తగూడలోని గిరిజన ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ సువర్ణపాక సరోజన తెలిపారు. గంగారం, కొత్తగూడ మండలాల్లో పలు టెక్నికల్ కోర్సులు చేసి ఖాళీగా ఉన్న వారు, కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు రేపు జరగనున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సరోజన కోరారు.

పదోతరగతి నుండి డిగ్రీ, బీటెక్ కోర్సులు చేసిన వారు ఇందులో పాల్గొనవచ్చన్నారు. 21 ఏండ్ల నుండి 35 ఏండ్ల వరకు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. శుక్రవారం ఉదయం 10.30 నుండి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఉద్యోగం కోసం వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, మూడు ఫోటోలు, బ్యాంక్ పాస్ బుక్, జిరాక్స్ రెండు సెట్లు తీసుకొని రావాలని సూచించారు.



Next Story