ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడితే.. చట్టరీత్యా చర్యలు

by  |
lands
X

దిశ,మేడ్చల్ టౌన్: ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు, మట్టి తవ్వకాలు జరిగితే సహించేది లేదని తహశీల్దార్ గీత హెచ్చరించారు. గురువారం మేడ్చల్ తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మండలంలోని కొనయపల్లి, మైసిరెడ్డిపల్లి గ్రామాల్లో కొంత మంది వ్యక్తులు అసైన్డ్ భూమిలో మట్టి కొడుతున్నారని ఫిర్యాదులు అందాయన్నారు. అసైన్డ్ భూమిలో వ్యవసాయం చేయకుండా మట్టి తవ్వకాలు చేపడితే వాళ్ళ పట్టా రద్దు చేస్తామన్నారు. అంతే కాకుండా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.



Next Story

Most Viewed