- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కెరీర్ మొదట్లో సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటిన తాప్సీ పన్ను.. ప్రస్తుతం బాలీవుడ్పై మాత్రమే కాన్సంట్రేట్ చేసింది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న భామ.. షూటింగ్స్ లేకపోవడంతో కాస్త ఖాళీగా ఉంటోంది. ఈ టైమ్ను అభిమానులకు దగ్గరయ్యేందుకు ఉపయోగించుకుంటోంది. కుటుంబంలో జరిగిన విషయాలు, తను చేసిన సినిమాల జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్న తాప్సీ.. రాఖీ పండుగ వస్తుండటంతో గతేడాది రాఖీ ఎలా జరుపుకుందో తెలుపుతూ ఫొటో షేర్ చేసింది.
https://www.instagram.com/p/CCqnukGp9LY/?utm_source=ig_web_copy_link
అన్నదమ్ములకు రాఖీ కట్టడం అంటే చాలా ఇష్టమని చెప్పిన తాప్సీ.. గతేడాది ఢిల్లీలో కజిన్స్ అందరినీ ఇంటికి పిలిపించుకుని రక్షాబంధన్ ఘనంగా జరుపుకున్నామని తెలిపింది. చాలా సంవత్సరాల తర్వాత గతేడాది అందరికీ వ్యక్తిగతంగా రాఖీ కట్టానని చెప్పింది. కానీ దురదృష్టవశాత్తు ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని.. వర్చువల్ రాఖీ వేడుకలు జరుపుకుందామని తెలిపింది. కానీ బ్రదర్స్.. ఈ కామర్స్ వ్యవస్థ ఇంకా బలంగా ఉందని తెలుపుకుంటున్నాను. కాబట్టి బహుమతులు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించింది.