సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ.. లైవ్ ఎక్కడో తెలుసా?

by  |
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ.. లైవ్ ఎక్కడో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియాలో దేశవాళీ క్రికెట్ జరగక ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. దీంతో బీసీసీఐ 2021లో దేశవాళీ క్రికెట్‌ను సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతో మొదలు పెట్టాలని నిర్ణయించింది. జనవరి చివరి వారంలో దేశంలోని అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోషియేషన్ల జట్లతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో కేవలం ఏడు మైదానాలకే ఈ మ్యాచ్‌లను పరిమితం చేశారు. వీటిలో నాకౌట్ మ్యాచ్‌లు గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియానికి కేటాయించారు. కాగా ఈ మ్యాచ్‌లు అన్నీ బీసీసీఐ గుర్తింపు పొందాయి కాబట్టి వీటిని స్టార్ స్పోర్ట్ , హాట్ స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. మ్యాచ్‌లు అన్నీ టీ20 ఫార్మాట్ కావడంతో సాయంత్ర మాత్రమే జరగనున్నాయి. నాకౌట్ మ్యాచ్‌లు అన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ తెలిపింది.



Next Story

Most Viewed