స్మార్ట్ థింకింగ్.. నేతల ‘స్వీట్’ స్టాచ్యు ప్రచారం

by  |
స్మార్ట్ థింకింగ్.. నేతల ‘స్వీట్’ స్టాచ్యు ప్రచారం
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ నేతల మధ్య వాడి వేడి ప్రచారం కొనసాగుతోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓ వ్యాపారవేత్త వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హౌడా ప్రాంతంలోని ఓ స్వీటు షాపు యాజమాని ఓటు హక్కు వినియోగంపై సరికొత్తగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీ విగ్రహాలను, బీజేపీ, తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ గుర్తులతో స్వీట్లు, సంయుక్త కూటమి నేతల స్వీటు విగ్రహాలను తయారు చేసి ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు షాపు యజమాని. తినుబండారాలతో ఇలా ప్రచారం చేయడం పట్ల స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed