ఇక యాడ్స్ లేకుండా హెచ్‌డీ ప్రసారాలు

by  |
ఇక యాడ్స్ లేకుండా హెచ్‌డీ ప్రసారాలు
X

దిశ, ఏపీ బ్యూరో: ఇక నుంచి వెంకటేశ్వర భక్తి ఛానల్​ యాడ్స్ ​లేకుండా ప్రసారాలు అందిస్తుందని టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన తిరుపతిలోని అలిపిరిలో ఎస్వీబీసీ కోసం నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించి మాట్లాడారు. రెండు స్టూడియోలు, టెలి పోర్టులు కొత్తగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యాడ్​ ఫ్రీ చేస్తున్నందున భక్తుల నుంచి విరాళాలు కోరుతున్నామని, ఇప్పటికే రూ.4కోట్లు రాగా, భక్తుల కోరిక మేరకు త్వరలోనే కన్నడ, హిందీ భాషల్లో కూడా ఛానళ్లు పెడుతున్నట్లు స్పష్టం చేశారు. ఎస్వీబీసీని పూర్తి హెచ్‌డీ ఛానల్‌గా మార్చుతున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.


Next Story