ఇద్దరు యాచకుల అనుమానాస్పద మృతి

by  |
ఇద్దరు యాచకుల అనుమానాస్పద మృతి
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా ఫిరంగిపురం బాలఏసు చర్చి దగ్గర గురువారం ఇద్దరు యాచకులు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. గత కొంతకాలంగా గుర్తు తెలియని ఓ వ్యక్తి, మహిళ భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆ ఇద్దరు ఒకే సారి మృతి చెందారు. దీంతో ఈ ఘటనపై స్థానికుల నుంచి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనారోగ్యంతో మృతి చెందారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story