ఐదో ఫ్లోర్ నుంచి దూకి భర్త సూసైడ్.. కానీ మూడో ఫ్లోర్‌లో..

by  |
ఐదో ఫ్లోర్ నుంచి దూకి భర్త సూసైడ్.. కానీ మూడో ఫ్లోర్‌లో..
X

దిశ, క్రైమ్‌బ్యూరో: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధి బీఎస్ మక్తాలో భార్యాభర్తలు అనుమానస్పదంగా మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగేశ్వరరావు, రోజా దంపతులు ఆరేళ్లుగా బీఎస్ మక్తాలో నివాసం ఉంటున్నారు. నాగేశ్వరరావు తాపీ మేస్త్రీ కాగా, భార్య రోజా గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. మంగళవారం ఉదయం 5 గంటలకు నాగేశ్వరరావు తాను నివసించే భవనం 5వ అంతస్తు నుంచి ఆత్మహత్య చేసుకోగా, వారు ఉండే మూడో ఫ్లోర్‌లో భార్య రోజా కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉంది. అయితే, ముందుగా భార్య మరణించిందా.. లేదా భర్త చేత హత్యకు గురైందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. దంపతుల మృతి వెనుక అనేక అనుమానాలు ఉన్నట్టు పలువురు భావిస్తున్నారు. రోజా తండ్రి సింహాచలం ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed