- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ప్రేమ వివాహం చేసుకున్నాడని గుర్తుతెలియని వ్యక్తులు ఒకరిని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపేసిన విషాద సంఘటన చింతగూడెంలో చోటు చేసుకుంది. గజ్జల రామారావు 24 అనే యువకుడిని బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోనుండి శ్మశాన వాటిక స్థలానికి బలవంతంగా తీసుకెళ్లారు. అతన్ని ముందుగా కర్రలతో చితకబాదారు. ఎట్టకేలకు రామారావును హతమార్చాలని వచ్చిన ఆ గుర్తు తెలియని వ్యక్తులు కింద పడవేసి గొడ్డలితో నరకగా మెడ భాగంలో, తల భాగంలో, వీపు భాగంలో తీవ్ర గాయాలై రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్ కుమార్, సీఐ సట్ల కిరణ్ కుమార్, ఎస్సై చరణ్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రేమ వివాహం చేసుకున్నాడనే నెపంతోనే తమ సోదరుడిని చంపేసి ఉంటారని ఆరోపిస్తూ సోదరులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.