జవహర్ నగర్‌లో దారుణం.. అనుమానాస్పద స్థితిలో ఆహుతి

by  |
జవహర్ నగర్‌లో దారుణం.. అనుమానాస్పద స్థితిలో ఆహుతి
X

దిశ, జవహర్ నగర్: జవహర్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి అగ్నికి ఆహుతయ్యాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వృద్దాప్యంలో ఉన్న అతడికి బీడీ తాగే అలవాటు ఉంది. ఆరోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ తెల్లారేసరికి శరీరమంతా కాలిన గాయాలతో ఆ వృద్దుడు మృతి చెందాడు.

స్థానికుల కథనం ప్రకారం.. కార్పొరేషన్ పరిధిలోని బాలాజీ నగర్ ఆనంద్ నగర్ కాలనీలో నివాసముంటున్న కుమార్ (58) రాత్రి అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో సజీవ దహనం అయ్యాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ దారుణం ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed