తన ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సర్వేయర్

by  |
Thikkanna
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: లంచం తీసుకుంటూ ఓ సర్వేయర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం రెవెన్యూ కార్యాలయంలో సర్వేయర్ గా పనిచేస్తున్న తిక్కన్నను రమణ అనే రైతు తన పొలాన్ని సర్వే చేయాల్సిందిగా కోరాడు. దీంతో అతను రైతు నుంచి లంచం డిమాండ్ చేశాడు. ఈ సమయంలో సర్వేయర్ కు రైతు ఎంతగా నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా తిక్కన్న వినిపించకపోవడంతో రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఇందులో భాగంగా బుధవారం రైతు రూ. 20 వేల జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న తిక్కన్న ఇంటికి వెళ్లి ఇచ్చే క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story