‘అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టులు లొంగిపోండి’

by Sridhar Babu |
‘అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టులు లొంగిపోండి’
X

దిశ,కొత్తగూడెం: మావోయిస్టు పార్టీలోని కొంతమంది నాయకులు, దళ సభ్యులు కరోనా వైరస్ బారిన పడి వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందిందని జిల్లా ఎస్పీ సునీల్‌దత్ కోరారు. కరోనా కారణంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ నాయకులు, దళ సభ్యులు ఎవరైనా వైద్య సదుపాయాలను పొందడానికి మావోయిస్టు పార్టీ నుండి బయటకు వచ్చి పోలీసువారి సహాయం పొందాలన్నారు. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు క్రింది స్థాయి నాయకులను సభ్యులను మెరుగైన వైద్యం పొందడానికి నిరాకరించిన యెడల, అట్టి వారు వెంటనే మావోయిస్టు పార్టీని వీడి బయటకు వచ్చి పోలీసు వారి సహాయం పొందవలసినదిగా సునీల్ దత్ వెల్లడించారు.



Next Story