సర్పంచ్ ఇంట్లో విషాదం నింపిన ‘డెంగ్యూ’..

by  |
సర్పంచ్ ఇంట్లో విషాదం నింపిన ‘డెంగ్యూ’..
X

దిశ, లింగాల : నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని పద్మన్నపల్లి గ్రామ సర్పంచ్ దేవి కుమారుడు నేనావత్ భరత్(10) డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలో ఆదివారం వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భరత్ గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, అచ్చంపేట నగరంలో పరీక్షలు చేయించగా డెంగ్యూ అని నిర్ధారణ అయినట్లు తెలిపారు.

జిల్లాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందించగా అక్కడ పరిస్థితి విషమించడంతో శనివారం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు లింగాలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడని తెలిపారు. కొడుకు మృతిలో సర్పంచ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.అయితే, మండలంలో డెంగ్యూ జ్వరం ప్రబలుతున్నా వైద్యాధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed