చావుబతుకుల్లో కొడుకు.. ఆర్థిక సాయం కోసం తల్లిదండ్రుల ఎదురు చూపులు

by  |
చావుబతుకుల్లో కొడుకు.. ఆర్థిక సాయం కోసం తల్లిదండ్రుల ఎదురు చూపులు
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేష్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడగా ఇద్దరు యువకులు మృతి చెందారు. అయితే భీముల సిద్దు అనే యువకుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి సర్జరీ చేయాలని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఆర్ధిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. శివాజీ నగర్ కు చెందిన గిరిబాబు-సరోజన దంపతుల చిన్న కుమారుడు సిద్దు డీజే లో పని చేస్తూ ఉండగా తల్లి చిన్న చిన్న పనులు నిర్వహిస్తుంది. అయితే ప్రస్తుతం సిద్దుకు అత్యవసరంగా ఆపరేషన్ చేయడానికి సుమారుగా 1లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. తమకు సహాయం చేసి తమ కుమారుడిని కాపాడాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed