ఆ జడ్జిలంతా మంచోళ్లు కాదా… న్యాయవాదికి సుప్రీం చివాట్లు

by  |
ఆ జడ్జిలంతా మంచోళ్లు కాదా… న్యాయవాదికి సుప్రీం చివాట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే వారం ఎన్‌కౌంటర్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషనన్‌కు వ్యతిరేకంగా న్యాయవాది ఘన్ శ్యాం ఉపాధ్యాయ్‌కు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయవాదికి చివాట్లు పెట్టింది. అయితే ఇప్పటికే ఈ కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న రిటైర్డ్ జడ్జి బీఎస్ చౌహాన్‌కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో బంధువులు ఉన్నారని, దీని వల్ల తమకు న్యాయం జరగదని ఆరోపించిన విషయం తెలిసిందే.

దీనిని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సుప్రీం స్పందిస్తూ… విచారణ నిష్పక్షపాతంగా ఎందుకు జరగదు? ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల్లో చాలామంది ఎంపీల కుమారులు ఉన్నారు. చాలామంది జడ్జిలకు పార్లమెంటులో బంధువులు ఉన్నారు. అయినంత మాత్రాన ఆ న్యాయమూర్తులంతా మంచోళ్లు కాదా? అలాంటి సంబంధాలు ఏమైనా చట్ట వ్యతిరేకమా?” అని సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్ఏ బాబ్డే సదరు న్యాయవాదిని నిలదీశారు.

దీనిపై న్యాయవాది ఉపాధ్యాయ్ స్పందిస్తూ… ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ఎన్‌కౌంటర్ల రాష్ట్రంగా మారిపోయిందని, న్యాయ వ్యవస్థను మొత్తం వాళ్లు తలకిందులు చేస్తున్నారని, ఇటీవలే రాజీవ్ పాండే అనే వ్యక్తిని ఎన్‌కౌంటర్ చేశారని తెలిపారు. అయితే న్యాయవాది చెబుతున్న విషయాలకు ఏమాత్రం పొంతన లేదంటూ సుప్రీం సీజే మండిపడ్డారు. ”ప్రతి రాష్ట్రంలో నిత్యం వేలాది నేరాలు జరుగుతుంటాయి. వాటన్నిటితో ఈ కమిషన్‌కి సంబంధం ఏమిటి” అని సీజే ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఉపాధ్యాయ్ ఇంకా ఏమైనా సూచనలు ఇవ్వదల్చుకుంటే ఇవ్వొచ్చంటూ తీర్పును వాయిదా వేశారు.

Next Story

Most Viewed