దుబాయ్ పీఎస్‌‌లో మహేశ్.. ఇంటర్నేషనల్ మీడియాలో న్యూస్

by  |
Mahesh Babu, Smart Police Station
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దుబాయ్‌లో ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ‘లా మెర్‌’లో గల ప్రపంచపు మొట్టమొదటి స్మార్ట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు ప్రిన్స్. ఇది వరల్డ్‌లోనే ఫస్ట్ స్మార్ట్ పీఎస్ కాగా.. మనుషుల(పోలీసుల) సహకారం లేకుండా 24 గంటల పాటు సేవలు అందిస్తుండటమే దీని ప్రత్యేకత.

ఈ విషయాన్ని తెలుపుతూ ఇంటర్నేషనల్ మీడియా వార్తలు ప్రచురించింది. కాగా గురువారం ఈ స్మార్ట్ పీఎస్‌ను సందర్శించిన మహేశ్.. తన అనుభవాన్ని వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడలేని అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అని, ఇందుకు సంబంధించిన సరికొత్త టెక్నాలజీ గురించి వివరించారు. ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ కోసం షార్జాను కూడా సందర్శించిన ఆయన.. కథలు, అద్భుతమైన వినోద కార్యక్రమాలు, అందమైన ప్రకృతి దృశ్యాల కలయికగా చిత్రీకరణ సాగుతున్నందుకు ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story