నిరసన తెలిపి వచ్చి ఆత్మహత్య

by  |
నిరసన తెలిపి వచ్చి ఆత్మహత్య
X

ఛండీగడ్: ఢిల్లీ సరిహద్దులో రైతు ఆందోళనలో పాల్గొని పంజాబ్‌లోని స్వగ్రామానికి తిరిగి వచ్చిన రెండు రోజులకే ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. విషాన్ని స్వీకరించి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. బటిండా జిల్లాలోని దయల్‌పుర మిర్జా గ్రామానికి చెందిన గుర్లభ్ సింగ్ కొన్నాళ్లుగా ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. శుక్రవారం స్వగ్రామానికి వచ్చిన సింగ్ ఇంట్లోనే విషాన్ని తీసుకున్నారు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లినా, గుర్లభ్ సింగ్ అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు. తక్కువ మొత్తంలోనే సాగు చేసే సింగ్ సుమారు ఆరు లక్షల అప్పులు చేసినట్టు సమాచారం. సింగ్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉన్నది.

శ్రద్ధాంజలి దినంగా ఆదివారం



Next Story

Most Viewed