ఇండియన్ హిస్టరీ (గ్రూప్ 2 స్పెషల్)

by Disha Web Desk 17 |
ఇండియన్ హిస్టరీ (గ్రూప్ 2 స్పెషల్)
X

తొలి వేదకాలం:

క్రీ.పూ 1500 -1000)

ఈ నాగరికత గంగానదిని ఆధారంగా చేసుకుని ప్రారంభమైంది. పశువుల కోసం ఆర్య తెగల మధ్య జరిగిన గవిస్థి అనే యుద్ధాలు ఈ కాలంలోనే జరిగాయి.

ఈ కాలంలో జరిగిన అతి ప్రధాన యుద్ధం దశరాజ గణ యుద్ధం

క్రీ. పూ 1000లో రావి/పరుశుణి నదీ తీరంలో జరిగింది. ఇది త్రిస్యగణ, భరత వంశస్థుడైన సుధాముడు అనే చక్రవర్తికి, పురు వంశానికి చెందిన పురుకుచ్ఛ అనే చక్రవర్తుల మధ్య జరిగింది.

సుధాముని ప్రధాన మంత్రి వశిష్టుడు

పురుకుచ్ఛ ప్రధాన మంత్రి విశ్వామిత్రుడు:

ఈ యుద్ధంలో విజయం సాధించింది త్రిస్య గణానికి చెందిన ధాముడు.

రుగ్వేదం:

ఈ గ్రంథం జెండావెస్థా (ఇరాన్ గ్రంథం)ను పోలి ఉంటుంది. దీనిని స్తోత్ర వేదం అంటారు.

వేదాలన్నింటిలో కెల్లా ప్రాచీనమైంది.

భారతదేశంలో సంకలనం చేయబడిన తొలి గ్రంథం.

దీనిలో 1028 శ్లోకాలు, 10 మండలాలు కలవు. ఈ శ్లోకాలన్నీ ప్రకృతి దేవతల ప్రార్థనలకు సంబంధించినవి.

వీటిలో 2 నుండి 7 వ మండలం వరకు సంకలనం చేయబడ్డాయి.

2 నుంచి 7 మండలాలను గోత్ర/వంశ మండలాలు అంటారు.

మూడో మండలంలో గాయత్రి మంత్రం గురించి పేర్కొనబడింది.

ఈ మంత్రం సావిత్రి అనే దేవతతో పాటుగా సూర్యుడికి సంబంధించింది.

7వ మండలంలో దశరాజ గణ యుద్ధం గురించి పేర్కొన్నారు.

9వ మండలంలో సోముడు అనే దేవత గురించి ఉంది. ఇతడు వృక్షాలకు అధిపతి.

పదో మండలంలో పురుషసూక్త కలదు.

ఈ మండలంలోనే విశ్వజననం, వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనబడింది.

రుగ్వేదంలో దైవాలు 3 వర్గాలు. అవి

1. పృద్వీ స్థాన పృథ్వి, అగ్ని, సోమ, బృహస్పతి

2. అంతరిక్షస్థాన ఇంద్ర, రుద్ర, అపమ్నాపత్, వాయు

3. వైయు స్థాన ధ్యాయస్ (ఆకాశ దేవత), వరుణ, మిత్ర, సూర్య, సావిత్రి

ఈ వేదకాలంలో 4కులాల గురించి వివరిస్తూ చాతుర్వర్ణ వ్యవస్థను పేర్కొన్నారు.

1. బ్రాహ్మణ 2. క్షత్రియ 3. వైశ్య 4. శూద్ర

పౌరోహిత్యం చేస్తూ గురువులూ, పురోహితులుగా పరిగణించబడేవారు

బ్రాహ్మణులు:

సమాజంలో నీతి నియమాలను కాపాడుతూ పరిపాలన చేసే వారు

క్షత్రియులు:

వర్తక వ్యాపారాలను నిర్వహిస్తూ వ్యవసాయ కార్యకలాపాలు చేసేవారు

శూద్రులు: కాయకష్టం ప్రధాన వృత్తిగా కలిగినవారు శూద్రులు.

ఈ వేదంలో మంత్రాలు చదివే వారిని హోత్రి అని అంటారు.

నా తండ్రి బ్రాహ్మణుడు, తల్లి శూద్రురాలు, అన్న వైశ్యుడు, నేను క్షత్రియుడ్ని అనే శ్లోకం ఈ వేదంలోనే కలదు.

సామవేదం:

ఈ వేదంలో మంత్రాలు చదివేవారిని ఉద్గటార్ అని అంటారు.

సామవేదం అనే పదం సమన్ అనే పదం నుండి వచ్చింది.

సమన్ అనగా శ్రావ్యమైన అని అర్థం

ఈ వేదంలో శ్లోకాల సంఖ్య 1603, 75 శ్లోకాలు తప్ప మిగిలినవి రుగ్వేదం నుండి తీసుకున్నారు.

అక్షరాస్యతకు సంబంధించి రుగ్వేదం నుంచి తీసుకున్న శ్లోకాల సముదాయం.

శివుని ఢమరుకం నుంచి ఉద్భవించింది. ఈ వేదంలో సంగీతం గురించి పేర్కొనబడింది.

భారతీయ సంగీత మూల బీజాలు (సప్త స్వరాలు) ఈ వేదంలో ఉన్నాయి.

యజుర్వేదం:

l ఈ వేదంలో మంత్రాలు చదివేవారిని అధర్వా అని అంటారు.

ఈ వేదంలో శ్లోకాల సంఖ్య 1836

బలి ఇచ్చే సమయంలో పఠించాల్సిన మంత్రాలు ఈ వేదంలోనే ఉన్నాయి.

ఇండో యూరోపియన్ల భాషలలో తొలి వచన గ్రంథం.

పద్య రూపంలోనూ, గద్య రూపంలోనూ ఉండే ఏకైక వేదం. ఈ వేదం రెండు రకాలు. అవి

1. శుక్ల యజుర్వేదం (పద్యరూపం) 2. కృష్ణ యజుర్వేదం (గద్య రూపం)

ఈ వేదంలోనే యజ్ఞయాగాలు, కర్మకాండలు గురించి పేర్కొనబడింది. యజ్ఞాలను 5 రకాలుగా వర్గీకరించవచ్చు.

1. పితృ యజ్ఞం 2. మనుష్య యజ్ఞం 3. దేవతా యజ్ఞం 4. భూత యజ్ఞం 5. బ్రహ్మ యజ్ఞం.

యాగాలను 5 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి

1. రాజసూయయాగం

2.సోమయాగం అమృతం

3. వాజపేయ యాగం

4. అశ్వమేథ యాగం

5. మహా వ్రత యాగం

అధర్వణ వేదం:

ఈ వేదంలో మంత్రాలు చదివే వారిని బ్రాహ్మణ అని అంటారు.

ఆర్యేతరుల కాలంలో సంకలనం చేయబడిన వేదం.

వైద్యం గురించి, వ్యవసాయ కార్యకలాపాల గురించి, గోత్రం గురించి, మంత్ర తంత్రం గురించి ఈ వేదంలోనే పేర్కొనబడింది.

తొలి వేదకాలంలో చక్రవర్తి అధికారాన్ని నియంత్రించడానికి సభ సమితి అనే కవలలను ఈ వేదంలోనే పేర్కొన్నారు. దీనినే దెయ్యాల శాస్త్రం అని అంటారు.

- ఏకే ఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్.


Next Story