కుషాయిగూడలో విద్యార్థిని అదృశ్యం

by  |
కుషాయిగూడలో విద్యార్థిని అదృశ్యం
X

దిశ, మేడ్చల్‌: కాలేజీకి బయలుదేరి వెళ్లిన విద్యార్థిని అదశ్యమైన ఘటన కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. స్థానిక టీచర్స్ కాలనీ చక్రిపురానికి చెందిన చిన్నారెడ్డి కూతురు శిరీష (20) ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. రోజూ మాదిరిగానే శుక్రవారం ఇంట్లో నుంచి కాలేజీకి బయలుదేరింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు శిరీష కోసం వెతికారు. బంధువులు, స్నేహితులను అడిగినా ఏలాంటి సమాచారం దొరకలేదు. దీంతో శిరీష తండ్రి చిన్నారెడ్డి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed