ఆన్‌లైన్ క్లాసులు వినమంటే.. శానిటైజర్ తాగేసిన విద్యార్థిని

by  |
ఆన్‌లైన్ క్లాసులు వినమంటే.. శానిటైజర్ తాగేసిన విద్యార్థిని
X

దిశ, ములుగు: శానిటైజర్ తాగి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందరావుపేట మండల కేంద్రానికి చెందిన తన్నీరు భూమిక (15) పదో తరగతి చదువుతున్నది. ఈ క్రమంలో విద్యార్థిని ఆన్‌లైన్ క్లాసులు సరిగ్గా వినడం లేదని తల్లిదండ్రులు భూమికను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన భూమిక శుక్రవారం మధ్యాహ్నం శానిటైజర్ తాగి అస్వస్థతకు గురైంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన భూమికను ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స అందించే క్రమంలో బుధవారం విద్యార్థిని మృతి చెందింది. మృతురాలి తండ్రి ఆనందయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed