అమ్మ కోనిచ్చిన ఫోన్ పోయిందని విద్యార్థి ఏం చేశాడంటే..

by  |
అమ్మ కోనిచ్చిన ఫోన్ పోయిందని విద్యార్థి ఏం చేశాడంటే..
X

దిశ, వెబ్‌డెస్క్ : అమ్మ కోనిచ్చిన సెల్ ఫోన్ పోయిందని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలోని బహుదూర్ పల్లిలో జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని జెన్నారం ఇళ్లలో ఉంటున్న సాయి కిరణ్ (17) అనే విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆన్ లైన్ క్లాస్ ల కోసం సాయి కిరణ్ తల్లి ఇటీవలనే రూ.10 వేల విలువైన ఫోన్ ను కోనిచ్చింది. అయితే ఆ ఫోన్ పోవడంతో భయాందోళనకు గురైన సాయికిరణ్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story