టీచర్ తిట్టారని విద్యార్థి సూసైడ్

by  |
టీచర్ తిట్టారని విద్యార్థి సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీచర్ మందలించారని మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కులకచర్ల మండలం చెల్లాపూర్ గ్రామంలో టెన్త్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాల్విడ్ హై స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న హరికృష్ణ.. గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధ్యాయుడు రమేష్ తిట్టడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు హరికృష్ణ సూసైడ్ నోటు రాశాడు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed