జలమండలిలో 6నెలల పాటు సమ్మెలు నిషేధం

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ జలమండలిలో ఏప్రిల్ 21 నుంచి ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. నీటి సరఫరా, పారిశుధ్యం ప్రజలకు అత్యంత అవసరమైన సర్వీసులు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 2019 అక్టోబర్ 21న ఆరు నెలల పాటు సమ్మెలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు ఈ నెల 20తో గడువు పూర్తి కాగా మరో ఆరు నెలల పాటు ఈ ఆదేశాలను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags: Hyderabad Strait, Strike Ban, Water Supply, April 21, Telangana



Next Story

Most Viewed